కామాంధులు అభం శుభంతెలియ‌ని చిన్నారుల‌పై పంజా విసురుతున్నారు. మాయ‌మాట‌లు చెప్పి త‌మ కోరిక‌ను తీర్చుకుంటున్నారు. విష‌యం బ‌య‌టికి చెప్ప‌కుండా బెదింపుల‌కు దిగుతున్నారు. చిన్నారుల జీవితాల‌ను మొగ్గ ద‌శ‌లోనే చిధిమేస్తున్నారు కామాంధులు. 


సూర్యాపేట జిల్లా పెన్‌ప‌హాడ్ మండ‌లంలోని నాగుల‌పాడులో 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు ఓ కామ‌పిశాచి. కోడ‌లు వ‌రుసైన మైన‌ర్ బాలిక‌కు కూల్ డ్రింక్ లో మ‌త్తు మందు క‌లిపి అత్యాచారం చేశాడు. ఏడు నెల‌లుగా ఈ తతంగాన్ని న‌డిపాడు దుర్మార్గుడు.  ఇక చివ‌ర‌కు మైన‌ర్ బాలిక గ‌ర్బం దాల్చ‌డంతో ఈ విష‌యం వెలుగులోకొచ్చింది. 


కాగా.. మైన‌ర్ బాలిక‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా గ‌ర్భ‌వ‌తిగా వైద్యులు నిర్దారించారు. దీంతో త‌ల్లిదండ్రులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. విష‌యం ఆరా తీయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కొచ్చింది. సొంత గ్రామానికి చెందిన 55 ఏళ్ల ఏలెంద‌ర్ అనే వ్య‌క్తి అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు అమ్మాయి తెలిపింది. 


నిందితుడిని నిల‌దీయ‌గా శీలానికి వెల క‌ట్టేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. కాంధుడు ఏలెంద‌ర్‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. త‌మ‌కు న్యాయం చేయాలంటూ బాధితురాలి త‌ల్లిదండ్రులు కోరారు. 


ఈ ఘ‌ట‌న‌పై మైన‌ర్ బాలిక త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సూర్యాపేట ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. నిర్బ‌య చ‌ట్టం కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: