రాష్ట్రంలోని ఐదు పోలింగ్
కేంద్రాల్లో రీ పోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నిర్ణయించింది. ఈ ఐదు
కూడా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే కావటం గమనార్హం. టిడిపి రాష్ట్ర
అధ్యక్షుడు కళా వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలింన ఎన్నికల సంఘం ఐదు పోలింగ్ కేంద్రాల్లో
రీ పోలింగ్ కు నిర్ణయించింది.
ఎన్నికల సంఘం నిర్ణయించిన రీ పోలింగ్ ఐదు కేంద్రాలు కూడా చంద్రబాబు పుట్టి పెరిగిన నియోజకవర్గం చంద్రగిరిలోనే ఉండటం విచిత్రంగా ఉంది. రీ పోలింగ్ జరపాలని ఈనెల 19వ తేదీన జరగనున్న చివరి విడత పోలింగ్ రోజే ఐదు కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. నియోజకవర్గోంలోని ఎన్ఆర్ కమ్మపల్లి 321, పులివర్తివారి పల్లి 104, కొత్తకండ్రిగ 316, కమ్మపల్లి 318, వెంకట్రామాపురం 313 కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు జరుగుతోంది.