ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారుణ ఓటమి దిశ‌గా వెళుతున్నారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ గెలుపు కోసం సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది ప్ర‌ముఖులు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా స‌పోర్ట్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల ఫ‌లితాల వేళ బాబు ఘోరంగా ఓడిపోతుండ‌డంతో బాబు ఓట‌మిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు చేసిన పాపాలు చుట్టుకుని సైకిల్‌ టైర్‌ పంక్చర్‌ అయిందనే సెటైరిక్‌ మీమ్‌ను ట్వీట్‌ చేశారు. 


ఇక ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబును టార్గెట్‌గా చేసుకుని వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ఏపీలో రిలీజ్ కాకుండా ఉండేందుకు టీడీపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. అప్పుడే వ‌ర్మ చంద్రబాబు, టీడీపీని టార్గెట్గా చేసుకుని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇక ఇప్పుడు ఫ‌లితాల్లో బాబు చిత్తుగా ఓడిపోతుండ‌డంతో వ‌ర్మ రెచ్చిపోయారు.


ఇక సైకిల్ టైర్ పంక్చ‌ర్‌తో పాటు మ‌రో ట్వీట్‌లో టీడీపీ పుట్టింది 1982, మార్చి 29 అని, చచ్చింది మాత్రం 2019, మే 23 అని తెలిపారు. టీడీపీ చావుకు.. అబద్దాలు, వెన్నుపోట్లు, అవినీతి, అసమర్థత, నారాలోకేష్‌, వైఎస్‌ జగన్‌ చరిష్మా కారణమని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఎన్నిక‌ల ఫ‌లితాలు పూర్తిగా వ‌చ్చాక వ‌ర్మ బాబు, టీడీపీని మ‌రింత‌గా ఆడుకుంటార‌నుకోవ‌డంలో ఎలాంటి సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: