మూడు జిల్లాలు టీడీపీకి కంచుకోటలు. ఇపుడు అవి మాడుపగిలేలా తీర్పు ఇచ్చాయి. వైసీపీ ప్రభంజనానికి టీడీపీ కోటలు బీటలు వారాయి. శ్రీకాకుళంతో మొదలైన సునామీ విశాఖ వరకూ కొనసాగింది. ఎక్కడా తేడా లేకుండా ఫ్యాన్ జైత్ర యాత్ర సాగిపోయింది.


శ్రీకాకుళంలో మొత్తం 10 సీట్లకు గాను ఎనిమిదింట వైసీపీ గెలుపు బాటన పయనిస్తోంది. విజయనగరంలో తొమ్మిదికి తొమ్మిదీ వైసీపీ అన్నట్లుగా హవా సాగుతోంది. ఇక విశాఖలో అర్బన్ జిల్లాలో రెండు తప్ప మిగిలిన సీట్లన్నీ ఫ్యాన్ పార్టీ పట్టుకెళ్ళేలా పరిస్థితి కనిపిస్తోంది.


మొత్తం మీద చూసుకుంటే ఉత్తరాంధ్ర గూబ గుయ్మనిపించే తీర్పు ఇచ్చింది. తట్టుకోవడం టీడీపీకి కష్టమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: