ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఓడిపోతున్నారు. మంత్రులే కాకుండా... చివరకు సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ సైతం మంగళగిరిలో ఓటమి బాటలో ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీలో పెద్ద తలకాయలు ఓడిపోతున్నారు. విజయనగరం వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు. కోలగట్ల కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ అభ్యర్థి అశోక్గజపతిరాజు కుమార్తె అతిధిపై ఘనవిజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీ చేసిన అశోక్... విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను కాదని తన కుమార్తెకు సీటు ఇప్పించుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల్లో ఆమె కోలగట్ల చేతిలో ఓడిపోక తప్పలేదు.. 2004లో తండ్రిని ఓడించిన కోలగట్ల ఇప్పుడు కుమార్తెను కూడా ఓడించారు. అలాగే పార్వతీపురం వైసీపీ అభ్యర్థి జోగారావు ఘనవిజయం సాధించారు. 22,391 ఓట్లతో విక్టరీ సాధించారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఎలీజా గెలుపొందారు. 145పైగా స్థానాల్లో వైసీపీ ఆధిక్యం కొనసాగుతోంది.