వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రోజా న‌గ‌రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు
గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా... భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న‌ను ఇప్పటి దాకా ఐరెన్ లెగ్ అని.. తాను గెలిస్తే జ‌గ‌న్ అధికారంలోకి రారంటూ ప్రచారం చేసిన వారికి ఇదే హెచ్చరిక అంటూ వార్నింగ్ ఇచ్చారు. త‌న‌నున్ను ఐరెన్ లెగ్ అన్న వారికి నా గెలుపే ఓ సమాధానం అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా...  రోజా.. 2681 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.


ఎన్నిక‌ల్లో గెలుపొందిన అనంత‌రం రోజా మీడియాతో మాట్లాడుతూ త‌న‌ది ఐరెన్ లెగ్ కాద‌ని, గోల్డెన్ లెగ్ అని స్ప‌ష్టం చేశారు. `నేను ఐరన్ లెగ్ అన్న వెధవలు ఇప్పుడేం మాట్లాడుతారు?`` అంటూ రోజా సూటిగా ప్ర‌శ్నించారు.  బైబై చంద్రబాబు అంటూ రోజా నినాదాలు చేశారు. ఆడవాళ్లు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని రోజా వ్యాఖ్యానించారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు మేలు చేసే పరిపాల‌న అందించ‌నున్నార‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: