కుప్పం ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ కంచుకోట అని మరోసారి నిరూపించారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన వైసీపీ నేత చంద్రమౌళి ఓటమి పాలయ్యారు. జగన్ మేనియా ఈ ప్రాంతంలో పని చేయలేకపోయింది.ఇక్కడ పాలన ఎలా ఉన్నా ప్రజలు మాత్రం ఎప్పుడు టీడీపీ వైపే ఉంటారు. కాని ఈసారి అధిష్టానం మారడంతో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చూడాలి.
వైసీపీ నేత పై అధిక మెజారిటీతో తో చంద్రబాబు గెలుపొందారు.ముందు నుంచి కూడా ఈ నియోజకవర్గం పై పెద్దగా శ్రద్ద పెట్టలేదని వైసీపీ నాయకులు అంటుంటారు. జగన్ కు ముందు నుంచి కూడా ఈ నియోజకవర్గం పై నమ్మకం లేదంట. కానీ ఈసారి అధిష్టానం లో జగన్ ఉండి ఇక్కడి ప్రజలను తదుపరి ఎన్నికలకు అయిన తన వైపు తిప్పుకుంటాడో లేదో చూడాలి.