యాత్ర సినిమా రాజశేఖర్ గురించి తీసి ఘనవిజయం సాధించిన సంగతీ తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ మీద తీసిన సినిమా బాబుకు చేయాల్సిన డామేజ్ చేసిందని చెప్పాలి. ఎన్నికల సమయంలో సినీగ్లామర్‌ను ఎక్కువగా నమ్ముకొనే చంద్రబాబును ఈసారి అదే సినిమారంగం ఘోరంగా దెబ్బతీసింది. ప్రధానంగా రెండు సినిమాలు టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. లక్షీపార్వతి జీవితచరిత్ర ఆధారంగా.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ పరాజయ పరిస్థితులు, ఓటమి అనంతరం కుంగదీసిన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘లక్షీస్‌ ఎన్టీఆర్‌’ టీడీపీ ఓటమిలో తనవంతు దోహదపడింది.


మరోవైపు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘యాత్ర’ సినిమా వైసీపీకి అనుకూల పరిణామాలను తీసుకొచ్చింది. సినీగ్లామర్‌ను ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకొన్న చంద్రబాబుకు.. ఆ గ్లామర్‌ ఏమాత్రం పనిచేయలేదు. ఎన్టీఆర్‌ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్న ఏపీ ప్రజలు.. బాబును ఓడించారు. బాబు ఓటమిలో కూడా ‘లక్షీస్‌ ఎన్టీఆర్‌’ ఎంతో కొంత పాత్ర పోషించిందనిచెప్పవచ్చు. 


కాగా, వైసీపీకి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘యాత్ర’ బాగా క‌లిసివ‌చ్చింది. రాజశేఖర్‌రెడ్డి ముందు నుంచి రాజకీయంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రజలకు రూపాయికే వైద్యంచేసిన రోజులు, మండు వేసవిలోచేసిన పాదయాత్ర, పాదయాత్రలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ ఈ సినిమాలో కండ్లకు కట్టినట్టు చూపించారు. యాత్ర సినిమాలో ఒక్కో డైలాగ్‌ కొన్ని వేల ఓట్లను మళ్లించిందని ఏపీ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: