ఏపీలో సర్వేల అంచనాలను మించిపోతూ ఫ్యాన్ ప్రభంజనం క్రియేట్ చేసింది. ఫ్యాన్ ప్రభంజనం ముందు సైకిల్ కొట్టుకుపోయింది. వైసీపీ 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లతో విజయడఖా మోగించింది. ఈనెల 30 జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే ఐదేళ్లపాటు వైసీపీ కార్యకర్తలను టీడీపీ వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడపలో ఐదేళ్ల పాటు టీడీపీ వాళ్లు వైసీపీ కేడర్ను ముప్పుతిప్పలు పెట్టారు. ఇక వీరికి మంత్రి ఆదినారాయణరెడ్డి బాగా వత్తాసు పలకడంతో కడపలో టీడీపీ దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్, పార్టీని ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఇబ్బందులకు గురిచేసిన నాయకులు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వీరిలో ఇప్పుడు మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా ఉన్నారు. జగన్ గెలుపుపై మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఎన్నికల్లో కడప ఎంపీగా టీడీపీ తరుపున పోటీ చేసిన ఆయన ఘోర పరాజయం చవిచూశారు. ఆయనపై అవినాష్రెడ్డి ఏకంగా 3 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
ఇక ఆది మాట్లాడుతూ వైసీపీ ఏపీలో మొత్తం 400 మంది టీడీపీ నేతలను టార్గెట్గా చేసుకుందని.. వీరిలో తాను మొదటి స్థానంలో ఉన్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆది చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఐదేళ్ల పాటు ఆయన టీడీపీ కేడర్ను ఎంతలా టార్గెట్ చేశారో ? అన్న సందేహాలు రాక మానవు. అందుకే ఇప్పుడు వైసీపీ తనను ఎక్కడ ? టార్గెట్ చేస్తుందో ? అన్న భయమే ఆయనలో ఉన్నట్టు తెలుస్తోంది.