దేశ‌వ్యాప్తంగా పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వార‌సుడెవ‌రో తేలిపోయింది. అమిత్ షా కేంద్ర కేబినెట్‌లో చేర‌డం ఖాయ‌మై నేప‌థ్యంలో... ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న అంశంపై నెల‌కొన్న స‌స్పెన్స్‌కు తొంద‌ర‌గానే తెర పడింది. బీజేపీ జాతీయ అధ్య‌క్షునిగా జేపీ న‌డ్డా నియామకానికి రంగం  సిద్ధమైంది. ఈ పదవికి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా వినిపించింది. అయితే, 59 ఏళ్ల‌ నడ్డాకు అమిత్ షాతో సాన్నిహిత్యం కారణంగా పార్టీ ఆయనవైపే మొగ్గు చూపడం ఖాయ‌మైంద‌ని స‌మాచారం.


ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా సహా మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల వ్యూహాన్ని నడ్డా పర్యవేక్షించనున్నారు. అనంతరం ఈ ఏడాది చివర్లో జమ్మూ కశ్మీర్లో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మరోవైపు కర్నాటక సంకీర్ణ ప్రభుత్వంపైనా బీజేపీ ఓ కన్నేసి ఉంచింది. వచ్చే ఏడాది మొదట్లో దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఎన్నికల హడావిడి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ సారథ్య బాధ్యతలు నడ్డాకి అప్పగించాలన్న ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. నడ్డా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా  కొనసాగుతున్నారు. పార్టీలో ఆయన ఎక్కువ ప్రచారంలో లేకపోయినప్పటికీ… మంచి వ్యూహకర్తగా పేరుంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను కూడా ఆయనే చూసుకున్నారు. నడ్డా సారథ్యంలో యూపీలోని మొత్తం 80 స్థానాలకు గానూ బీజేపీ 62 చోట్ల విజయం సాధించింది.


గత మోదీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడైన నడ్డా బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీలో మాస్టర్ స్ట్రాటజిస్ట్ అని ఆయనకు పేరుంది. చాలా వేగంగా వ్యూహాలు రచిస్తారని ఆపార్టీ నేతలు చెబుతుంటారు. మినీ ఇండియాగా పేరొందిన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టానికి ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఈ ఏడాది జనవరిలో నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80సీట్లలో బీజేపీ ఏకంగా 62 లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. మిత్రపక్షం అప్నాదళ్ రెండింట్లో విజయం సాధించింది. బీఎస్పీ-ఎస్పీ కూటమి నుంచి గట్టీ పోటీ ఎదురైనప్పటికీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంలో ఆయన వ్యూహాలు ఫలించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: