'ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, బాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందనుకున్నాం.
40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా?, పోతుందా అనే సంశయం తప్ప...ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా...?' 
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాజధానిలో నది కరకట్ట వెంట నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని తమకు ఇవ్వాలంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు.దానిపై వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్‌ ఇది.

 దానికి కొనసాగింపుగా, యనమలకు ఈ రోజు మరో ట్వీట్‌తో ఒక పంచ్‌ వదిలారు.

.విజయసాయి. '' యనమల గారు , మీరు అడగడం ,మేం ఇవ్వడం మొదలు పెడితే...లోకేష్‌ కోసం ప్రకాశం బ్యారేజీ,చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు ఇవ్వమని అడగ గల సమర్ధులు మీరు...'' విజయ సాయి వదిలిన ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
దీని పై యనమల ఇప్పటి వరకు నోరు మెదప లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: