తెల్లవారుజామున ఘోర రోడ్జుప్రమాదం
రేణిగుంట మండలం గురవరాజుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనదాంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు గుంటూరుజిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామస్తులుగా గుర్తించారు.
గుంటూరు నుంచి శ్రీవారి దర్సనార్థం తిరుమలకు వస్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. మృతి ల్లో ఐదుగురు మగవారు, ఒక మహిళ ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు.