జగన్ ప్రభంజనం ముందు టీడీపీకి మిగిలిన నాయకులూ కేవలం 23 మంది. జగన్ ఒక్క సైగ చేస్తే చాలు టీడీపీ ఖాళీ అవ్వటానికి, కానీ ఆ విషయంలో జగన్ మాత్రం ఇష్టంగా లేరు. ఆంధ్రప్రదేశ్‌లో గనుక, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే, గతంలో టీడీపీ చేసిన దాష్టీకానికి రివెంజ్‌ తీర్చుకోవాలనుకుంటే.. ఓ నెల రోజుల్లోనే టీడీపీ ఖేల్‌ ఖతమ్‌ అయిపోతుందన్న దాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వైసీపీతో టచ్‌లోకి వెళుతున్నా, సింపుల్‌గా 'సారీ' చెప్పేస్తున్నారట వైసీపీ ముఖ్యనేతలు.


'సారీ నో వేకెన్సీ' అంటూ వైసీపీ అధినాయకత్వం చెబుతోంటే, చేసేదిలేక.. టీడీపీలో వుండలేక.. బీజేపీ వైపు చూస్తున్నారు సదరు తెలుగు తమ్ముళ్ళు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్‌లో ఎటూ సీట్లు లేవు గనుక, పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి తద్వారా వచ్చే 'వాపుని బలుపుగా' చూపించుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నమాట వాస్తవం. అయితే, బీజేపీ వైపు ఎంతమంది తెలుగు తమ్ముళ్ళు వెళతారన్నది ఇప్పుడే చెప్పలేం.


'ఒకరిద్దరు పార్టీని వీడినా నష్టంలేదు' అని టీడీపీ అధినాయకత్వమే చెబుతోందంటే, పార్టీ ఫిరాయింపులపై ఆ పార్టీలో అప్పుడే వణుకు మొదలైందని అనుకోవచ్చు. కానీ, శాసనసభా పక్ష విలీనాల్లాంటి 'వైపరీత్యాలు' ఆంధ్రప్రదేశ్‌లో వుండవని టీడీపీ బలంగా నమ్ముతోంది. వైఎస్‌ జగన్‌ మీద అంత గొప్ప నమ్మకం వుందన్నమాట తెలుగుదేశం పార్టీకి. ఇప్పటికైతే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించాలన్న ఆలోచన లేని వైసీపీ, ఐదేళ్ళూ అదే మాట మీద నిలబడితే, చంద్రబాబు అదృష్టవంతుడి కిందే లెక్క.. ఎలాగోలా ఐదేళ్ళు పార్టీని అలా అలా లాగేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: