బాబుగారి మనసులో ఇప్పుడు చాలా ఆనందం ఉంది.  ఆ ఆనందానికి కారణం ఏంటో తెలిస్తే మీరంతా తప్పకుండా షాక్ అవుతారు.  వైకాపా మంత్రి వర్గ విస్తరణలో బాబుపై కోపం ఉన్న కొంతమంది వ్యక్తులకు మంత్రి పదవులు రాలేదు.  ఒకవేళ వాళ్లకు మంత్రి పదవులు ఇస్తే.. తెలుగుదేశం పార్టీపైన వాళ్ళ రుబాబు ఎలా ఉంటుందో తెలుసు. 


నిన్నటి  వరకు బాబులో ఈ భయం ఉండేది.  కానీ, ఇప్పుడు ఆ భయం లేదు.  దాని ప్లేస్ లో కొంత ఆనందం ఉంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో రోజాను తెలుగుదేశం పార్టీ ఎలా ట్రీట్ చేసిందో చెప్పక్కర్లేదు.  ఆమెను ఎన్ని మాటలు అన్నారో అందరికి తెలిసిందే. 


ఈసారి ఆమెకు స్పీకర్ పదవి ఇస్తారని వార్తలు వచ్చినపుడు, లేదు హోమ్ మినిష్టర్ పదవి ఇస్తారని వార్తలు వచ్చినపుడు చాలా భయపడ్డారు.  తీరా ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చే సమయానికి రోజా పేరు లేకపోవడంతో బాబు కొంచెం హ్యాపీగా ఉన్నారని సమాచారం.  బాబుతో కొంతమంది సీనియర్ నేతలు కూడా ఈ విషయంపై హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. 


అయితే, స్పీకర్ పదవిని తమ్మినేని సీతారాం కు ఇవ్వడంతో బాబు కొంత ఇబ్బందుల్లో పడ్డాడని తెలుస్తోంది.  తమ్మినేని గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.  కొన్ని కారణాల వలన ఆ పార్టీని వదిలి వైకాపాలో జాయిన్ అయ్యారు.  ఇప్పుడు ఆయనకు స్పీకర్ పదవిని ఇచ్చింది వైకాపా. 


మరింత సమాచారం తెలుసుకోండి: