దక్షిణాది టాప్ హీరో ఎవరు అంటే రజినీకాంత్ అనే చెప్తారు.  రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా అనుకుంటున్నారు.  కానీ  ఇప్పటి వరకు అది సెట్ కావడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. ఎన్నికలకు ముందు చేయడం లేదని అన్నారు.  


అంతేకాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉంటానని, పార్టీ సిద్ధం అవుతుందని అన్నారు.  రజిని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం మరోసారి ఫైర్ అయ్యారు.  రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని పలుమార్లు చెప్పరాని ఇప్పటి వరకు దానిపై క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. 


బీజేపీ సిద్ధాంతాలు బాగున్నాయని అంటూనే ... పార్టీలోకి ఆహ్వానించినా అటువైపు కూడా చూడటం లేదని చెప్పడం విశేషం. రజిని సొంత పార్టీ పెట్టె ఉద్దేశ్యంతో మొన్నటి వరకు ఫ్యాన్స్ తో రజినీకాంత్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.  కానీ, రాణినికాంత్, అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉంటానని అంటున్నాడు.  


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది.  వచ్చే రెండేళ్లలో అయినా రజిని రాజకీయాల్లోకి వస్తారా లేదంటే ఎందుకులే అని చెప్పి సైలెంట్ గా సినిమాలు చేసుకుంటారా చూడాలి.   ఎన్నికల్లో పోటీ చేయడం అంటే మామూలు విషయం కాదు.  ఒకవేళ రజిని ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారు అన్నది నిజం.  


మరింత సమాచారం తెలుసుకోండి: