తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ కు జగన్ అవకాశం ఇచ్చారు. అయితే సామాజిక వర్గాల లెక్కలతో కొందరు సీనియర్లకు మంత్రి పదవులు దక్కలేదు. చిత్తూరు జిల్లా నుంచి కేబినెట్ బెర్త్ ఆశించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నిరాశే మిగిలింది. వైఎస్ జగన్ భాస్కర్ రెడ్డికి రెండు కీలక పదవులు అప్పగించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఏపీ ప్రభుత్వ విప్ పదవి దక్కింది.


అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెవిరెడ్డిని తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిచంద్రగిరి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. సీనియర్ కావడంతో మంత్రి పదవి వస్తుందని ఆశించినా.. కొన్ని సమీకరణాలతో దక్కలేదు. దీంతో చెవిరెడ్డికి రెండు కీలక పదవులు అప్పగించారు జగన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: