మహిళలపై అత్యాచారం జరగడం ఒక రాక్షసమైన చర్య అదే అత్యాచారం ఒక యువకుడి పై జరిగితే, అవును ఒక యువకుడిని ఐదు మంది వ్యక్తులు అత్యాచారం చేసిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని దొరవారి సత్రం మండలం ఉచ్చురూలో ఈ ఘటన జరిగింది.


26 ఏళ్ల యువకుడు సూళ్లూరుపేట లోని షోరూమ్ వద్ద ఆగి ఉండగా కొందరు వ్యక్తులు ఆటోలో కిడ్నాప్ చేసుకొని వెళ్లి మున్నూరు పాలెం గ్రామ శివార్లలో పొదల్లోకి తీసుకు వెళ్లారు అయుదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు.అంతేకాకుండా అత్యాచార ఘటనని వీడియోలు తీసి ఎవరికీ అయినా చెప్తే చంపేస్తామని బెదిరించారు.ఆ తర్వాత వదిలి వేసారు.కోలుకున్న యువకుడు సమీపంలోని పోలీస్ స్టేషన్ కి వెళ్ళీ వారిపై కేసు నమోదు చేసాడు.


ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఒక అబ్బాయి పై అత్యాచారం జరగడం సంచలనం సృష్టిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: