ప్రధాని మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత శ్రీలంక పర్యటను ముగించుకొని తిరుపతి వచ్చారు. తిరుపతిలో బీజేపీ సభ అనంతరం మోడీ తిరుమల వెళ్లారు. శ్రీ వేంకటేశ్వరుని దర్శనం తరువాత ఓ ఆసక్తికరమైన విషయం జరిగినట్టు తెలుస్తోంది.
తిరుమలలోని శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్ హౌస్ లో మోడీ, జగన్ లు రహస్యంగా సమావేశం అయ్యారని, ఈ సమావేశం ఏకాంతంగా జరిగిందని..అటు బీజేపీ నుంచిగాని, ఇటు వైకాపా నుంచి కానీ ఎవరు హాజరు కాలేదని, రహస్యంగా కొంతసేపు మీటింగ్ జరిగినట్టు తెలుస్తోంది.
ఆ మీటింగ్ సారాశ్యం ఏంటి... ఏఏ విషయాలపై చర్చలు జరిపారు.. ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయి అనే విషయాలను బయటకు చెప్పడంలేదు. ఆంధ్రపదేశ్ అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాట్లాడుకొని ఉండొచ్చు. రాష్ట్రానికి అందివ్వ వలసిన సహాయం గురించి మోడీని జగన్ అడిగి ఉండొచ్చు.
లేదంటే జగన్ పాలనా పరమైన విషయాల గురించి వీరిద్దరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చు. అసలు వాళ్ళ మధ్య ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయి అన్నది సస్పెన్స్ గా మారింది. గెస్ట్ హౌస్ సాక్షిగా ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియడం లేదు.