గత ప్రభుత్వాలు చేసిన తప్పులను చూసి నేర్చుకోవాల్సిన కొత్త ప్రభుత్వాలు మళ్ళీ అదే తప్పును చేస్తే ఆ ప్రభుత్వం కూడా అయదేళ్ళ తర్వాత గత ప్రభుత్వం లిస్టు లోకి వెళ్తుంది.ప్రస్తుతం రాష్ట్రం లో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ గతంలో టీడీపీ చేసిన ఒక తప్పును చేస్తుంది.అది గ్రహించి సరిచేసుకోకపోతే ప్రజలు భవిష్యత్తులో వారిని పక్కన పెట్టే ప్రమాదం ఉంది.


గతంలో టీడీపీ ప్రతినిధులు అయిదేళ్ళ పాటు రోజూ ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం,అవమానించడం పనిగా పెట్టుకొని ఛానెల్ లో కూర్చునేవారు. అది ప్రజలకు చిరాకు,విరక్తి కలిగించింది.అందుకే వారిని ఈసారి ప్రతి పక్షంలో కూర్చోబెట్టారు.ఇప్పుడు వైసీపీ నాయకుడు విజయ సాయి రెడ్డి రోజూ మరో పని లేకుండా సోషల్ మీడియాలలో టీడీపీ ని ఆడిపోసుకోడమే పనిగా పెట్టుకున్నారు.


చేయాల్సిన అభివృద్ది. చేస్తున్న అభివృద్ది గురించి మాట్లాడకుండా ఇలా ప్రతి పక్షాలను చులకనగా మాట్లాడుతూ అవమానించడం సరైన పద్దతి కాదు. వైసీపీ అధ్యక్షుడు ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకొని ఆపకపోతే టీడీపీ లా వైసీపీ కూడా రానున్న కాలంలో దారుణ ఓటమి చూడాల్స వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: