ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు, విద్యార్థులకు వరాల జల్లు కురిపించాడు. రైతులకు అక్టోబర్ నెల నుండి రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 12,500 రుపాయలు అందించబోతున్నారు. రైతులకు వడ్డీ లేని రుణాలను అందించబోతున్నాడు. ఉచితంగా బోర్లు రైతులకు వేయించబోతున్నాడు.
అమ్మ ఒడి పథకం వచ్చే సంవత్సరం జనవరి 26న మొదలు కాబోతుంది. ఈ పథకం ద్వారా 15,000 రుపాయలు ఈ పథకానికి అర్హులైన వాళ్ళు పొందబోతున్నారు. గ్రామ వాలంటీర్ల నియామకానికి కూడా అర్హతను రూపొందింఛారు
గ్రామ వాలంటీర్ల నియామకంలో పట్టణాల్లో కనీస అర్హతను డిగ్రీగా గ్రామాల్లో ఇంటర్మీడియట్గా గిరిజన ప్రాంతాల్లో మాత్రం పదవ తరగతిగా నిర్ణయించారు. ఆశా వర్కర్ల వేతనాలను అంగన్ వాడీ వర్కర్ల జీతాలను పెంచటానికి ఆమోదం ఇచ్చారు. ఫెన్షన్ల పెంపుకు కూడా ఆ కేబినేట్లో ఆమోదం తెలిపారు