ఒకటో తేదీ వచ్చింది... త్వరగా రేషన్ తెచ్చుకోవాలి లేదంటా మనకు లేదంటారూ...! అని గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ చర్యను ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. సోమవారం జరిగిన తోలి కెబినేట్ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదలకు నేరుగా సరుకులు అందించేందుకు సరికొత్త ప్రణాళికను అమలు చేయనున్నారు.

ఇక నుంచి రేషన్ బియ్యం కోసం చౌకధరల దుకాణాలకి వెళ్లాల్సిన పనిలేదు.. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం మీ ఇంటికే డోర్ డెలివరీ చేయబేతోంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించనున్నారు.

సెప్టెంబర్ 5 నుంచి ఈ కార్యక్రమం పట్టాలెక్కనుంది. బియ్యాన్ని అత్యంత నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. 5, 10, 15 కిలోల బియ్యం సంచులను సెప్టెంబర్ 1 నుంచి నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు.

బియ్యం, కందిపప్పు, పంచదారతోపాటు మరో రెండు లేదా మూడు నిత్యావసర సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని ఈ రోజు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: