మంత్రివర్గ విసరణలో చోతు లభించకపోవడంతో పూర్తిగా డిప్రెషన్ మూడ్ లోకి వెళ్ళిపోయిన సినీ నటి, నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజాకు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ నుంచి ఫోన్ వచ్చింది. తనను అర్జంట్ గా  కలుసుకోవాలని జగన్ రోజాకు కోరారు. దాంతో హైదరాబాద్ లో ఉంటున్న  రోజా హుటాహుటిన అమరావతి బయల్దేరారు.


ఇదిలా ఉండగా జగన్ రోజాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల ఆమె తీవ్రంగా కలత చెందారు ఏకంగా మంత్రుల ప్రమాణానికి కూడా డుమ్మా కొట్టారు. గత పదేళ్ళుగా జగన్ వెంట ఉంటూ ఎన్నో పోరాటాలు చేసిన రోజాకు తొలి విడతలోనే బెర్త్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ  రెడ్లకు అనూహ్యంగా మంత్రి మండలిలో ప్రాధ్యంత తగ్గించిన జగన్ సామాజిక సమీకరణల నేపధ్యంలో ఆమెకు అవకాశం ఇవ్వలేకపోయారు.


ఈ పరిస్థితులలో జగన్ ఆమెను బుజ్జగించడమే కాకుండా మంత్రి పదవితో సమానమైన క్యాబినెట్ ర్యాంక్ పదవిని ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇక రెండున్నరేళ్ళ తరువాత విస్తరణలో రోజాకు మళ్ళీ బెర్త్ కచ్చితంగా ఉంటుందని భరోసా ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి మంత్రి పదవి దక్కకపోయినా రోజాకు బంపర్ ఆఫర్ మాత్రం జగన్ ఇవ్వనున్నారన్న  వార్త ఇపుడు పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: