రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి గత ఆదివారం విచ్చేసిన విషయం తెలిసిందే. అయితే, శ్రీవారి దర్శనానికి విచ్చేసిన ప్రధానికి ఒక అరుదైన ౙ్నాపిక ను (మొమెంటో) బహూ కరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ప్రయత్నించినట్టు తెలిసింది. బహు పురాతన నాణేలతో దానిని తయారు చేయించేందుకు సిద్ధపడటంతో అది వివాదానికి కారణం అవుతోంది. అధికారుల అత్యుత్సాహంతో టీటీడీ మ్యూజియంలోని 14, 15 శతాబ్దాల నాటి పురాతన నాణేలు, పలు రకాల ఆకృతులతో ఉన్న కొన్ని నమూనాల వినియోగించి ఒక  జ్ఞాపికను తయారీ చేసే పనిని బయట వ్యక్తులకు పురమాయించారు. 


ఇందుకు సంబంధించి గత శనివారమే, అంటే నరేంద్ర మోడీ తిరుపతి విచ్చేసే ఒక రోజు ముందు ఙ్జాపిక తయారీదారుల కు నాణేలను అందజేసింది. వీటితో అందంగా, ఆకర్షణీయంగా  ఙ్జాపిక తయారు చేయాలని ఆదేశించారు. ఆదివారం శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రధానికి దీనిని అందించి అత్యుత్తమ బహుమతి గా ఆయనకు పరిచయం చేయాలని భావించినట్లు తెలుస్తోంది.  కానీ, మ్యూజియంలో ఉండాల్సిన విలువైన నాణేలు బయటకు రావడం, ఈ వార్త మీడియాకు చేరడంతో టీటీడీ వెనక్కు తగ్గింది. దీంతో ఈ ప్రతిపాదనను అధికారులు విరమించుకున్నట్లు సమాచారం. 

Image result for TTD tried to give Modi Momento

టీటీడీ అత్యుత్సాహంపై ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. టీటీడీ అధికారులు చేసిన ప్రయత్నాల గురించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తామని అంటున్నారు. ఏవరైనా ప్రముఖులు స్వామివారి దర్శనం కోసం తిరుమల వస్తే వారికి మహాద్వారం నుంచి ఆలయం ప్రవేశం కల్పిస్తారు. దర్శనానంతరంరంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలుకుతారు. తర్వాత, టిటిడి ఈవో, జెఈవో కలిసి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేస్తారు. దీనికి భిన్నంగా  ప్రధానికి సహస్రాబ్ధాలనాడు ఏవరో చక్రవర్తులు బహూకరించిన విలువైన నాణేలతో తయార చేసిన ఙ్జాపికను  అందజేయడానికి ప్రయత్నించడం వివాదానికి తెరతీసింది.


అసలు ఇప్పటికీ టిటిడీలో కొనసాగుతున్న గత ప్రభుత్వ నామినేటెడ్ పదవులను అలంకరించిన వాళ్ళ వ్యూహం ఈ నేపధ్యం లో ఉండవచ్చని తద్వారా వీలైతే ప్రధానిని ఆయన వెన్నంటి ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రిని బదనాం చేసే ప్రణాళిక ఉండి ఉండొచ్చని అంటున్నారు వారి తరహా విధానం తెలిసిన సూక్ష్మ గ్రాహకులు. అంతేకాదు ఆ దేవదేవునికి పురాతన కాలములో సార్వభౌములు చక్రవర్తులు రాజులు సామంతులు సమర్పించిన విలువైన కానుకలు ఈ రూపాల్లో బయటకు వెళ్ళిన సందర్భాలపై కూడా విచారణ జరిపించాలి అని శ్రీవారి భక్తులు ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: