అతనికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రాణం. ఆయనకు వీరాభిమాని. 2009
లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత జగన్ సిఎం కావాలని కోరుకున్నాడు ఆ
అభిమాని. కానీ, మహానేత నిష్క్రమణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల
నేపథ్యంలో జగన్కు ఆ పదవి దక్కలేదు.
వైఎస్ కు,
జగన్ కు వీరాభిమాని అయిన ఆదిలాబాద్ కు చెందిన బెజ్జంకి అనిల్ అనే వ్యక్తి
జగన్ కోసం ఓ వ్రతం స్టార్ట్ చేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను
చెప్పులు వేసుకోనని శపధం చేశాడు. అనుకున్నట్టుగా గత పదేళ్లుగా చెప్పులు
లేకుండానే తిరిగాడు.
పదేళ్లకు అతని శపధం
నెరవేరింది. జగన్ ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడంతో.. అనిల్ కుమార్
బాసర వెళ్లి జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కు
చెల్లించుకున్నారు. పదేళ్ల తరువాత చెప్పులు తొడుక్కున్నారు. ఈ న్యూస్
సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనిల్ కుమార్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వైకాపా కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
అభిమానం అంటే ఇదే అని అనిల్ రుజువు చేశాడు. పదేళ్లపాటు చెప్పులు లేకుండా
తిరగడం అంటే మాములు విషయం కాదు. చాలా ఇబ్బందులు వస్తాయి.