చంద్రబాబు .. అధికారంలో చేతిలో ఉన్నప్పుడు ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి చివరికి ప్రజాగ్రాహానికి లోనై ఓటమి పాలైయ్యాడు. అయితే బాబు గారు ఇప్పుడు మాత్రం 10 రూపాయల బాటిల్ కూడా వాడకపోవడం ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇప్పుడు స్వంత డబ్బులు పెట్టాలి కదా .. బాబు గారి హయాంలో అయన మరియు అతను పుత్ర రత్నం లోకేష్ మాత్రమే హిలమాలయ బాటిల్స్ వాడేవారు.


కానీ జగన్ మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. చంద్రబాబు జమానాలో ఆర్భాటాల కోసం.. సోకు కోసం పెట్టిన ఖర్చు అంతా ఇంతా కాదు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుందే ఇలాంటివాటికి తన దగ్గర నడవవని తేల్చేసిన జగన్.. సింఫుల్ గా ఉంటున్నారు. తాజాగా తిరుపతికి వచ్చిన ప్రధాని మోడీకి తానేమిటన్న విషయాన్ని.. ఖర్చు విషయంలో తన తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని తన చర్యతో చెప్పకనే చెప్పేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.


సాధారణంగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం పలికే క్రమంలో భారీ బొకేల.. పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వటం ఒక అలవాటుగా ఉండేది. అందుకు భిన్నంగా తాజాగా బొకేలను బంద్ చేసి సింగిల్ గులాబీని ముచ్చటగా చేతికి ఇచ్చిన వైనం కొత్తగా ఉండటమే కాదు.. అనవసర ఖర్చుకు ఎలా కళ్లెం వేస్తానన్న విషయాన్ని మోడీకి జగన్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: