అంతపురం జిల్లా లో ఓ చర్చి ఫాదర్ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. తాడిపత్రిలో ఓ చర్చి నడుపుతున్న ఫాదర్ ఎమిలీ రాజు చర్చి కి వచ్చే బాలికలతో నగ్నంగా పడుకుని మసాజ్ చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్లో ఓ బాలిక తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కానీ ఫాదర్ తనకు రాజకీయంగా పోలీసులతో ను ఉన్న పలుకుబడిని అడ్డంపెట్టుకుని కేసు ముందుకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాడు. తాజాగా ప్రభుత్వం మారటంతో ఇకనైనా తనకు న్యాయం జరుగుతుందని బాలిక తల్లి కొత్త హోంమంత్రి మేకతోటి సుచరిత కు ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకుంది. వెంటనే స్పందించిన హోమంత్రి ఫాదర్ ను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నేరుగా హోమ్ మంత్రి ఆదేశాలు జారీ చేసిన అవి అమలు కావడం లేదు. ఫాదర్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా సెర్చ్ కమిటీ సభ్యులు, మహిళలను అడ్డం పెట్టుకొని ఫాదర్ ఇష్యూ గా మార్చారు. సున్నితమైన సమస్య కావడంతో పోలీసులు కూడా అరెస్టు చేయకుండా వెనుతిరిగారు.
వ్యవహారం హోంమంత్రి వరకు వెళ్లడంతో అరెస్టు తప్పదని భావించిన చర్చి ఫాదర్ పరారైనట్టు తెలుస్తోంది. హోం మంత్రికి ఫిర్యాదు చేసిన ఫాదర్ అరెస్టు కాకపోవడంతో బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. విజయవాడ వచ్చి నేరుగా హోం మంత్రిని కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఫాదర్ అరెస్టు వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.