కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న మావోలో మళ్లీ రెచ్చిపోతున్నారు.  జార్ఖండ్‌లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. సరైకెలా జిల్లాలోని ఓ మార్కెట్‌లో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు పోలీసులు మృతి చెందారు. జార్ఖండ్- పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతమైన సరైకెలా జిల్లాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి.


కాల్పుల అనంతరం పోలీసుల వద్ద నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ దుశ్చర్యలో ఇద్దరు నక్సలైట్లు పాల్గొనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బీహార్-పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. సరైకెలా జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.గత నెలలో మహారాష్ట్రలోని గడ్చిరోలా జిల్లాలో కమెండోలతో వెళ్తున్న పోలీసు వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసిన ఘటనలో 15 మంది పోలీసులు మృతి చెందారు. 


మావోయిస్టు ఘాతుకాన్ని జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల త్యాగాలు వృథాకావని..మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల ఇక చివరి రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. గత నెల 28న ఇదే జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది కోబ్రా కమాండెంట్‌లతో సహా మొత్తం 12 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: