టీడీపీ పార్టీ ఘోర  పరాజయం తరువాత టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా టీడీపీ ఓటమి పై సుజనా చౌదరి స్పందించారు. ఎన్నికల ముందు అసలు ఉనికే లేని కాంగ్రెస్ తో సఖ్యతగా ఉండటం అదే సమయంలో ఏపీలో పెద్దగా ఉనికిలో లేని బీజేపీతో యుద్ధం చేయడం.. ఈ రెండూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్లు అని అంటున్నారట ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి! ఈ విషయంలో తమబోటి వాళ్లు చెప్పినా చంద్రబాబు నాయుడు వినలేదని చౌదరి అంటున్నారని సమాచారం. 


పదే పదే జగన్ పై కేసులు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ప్రస్తావించడం కూడా ఆ పార్టీ ఓటమికి ఒక కారణం అని చౌదరి విశ్లేషిస్తూ ఉండటం గమనార్హం. జగన్ మోహన్ రెడ్డి తన తెలివితేటలతో డబ్బులు సంపాదించుకుని ఉండవచ్చని అక్రమాలు చేసి కాదని.. సుజనా చౌదరి ఇప్పుడు అంటున్నారట!అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం పదే పదే ఆ కేసులనే రాజకీయం అనుకుందని దీంతో తేడా వచ్చిందని చౌదరి విశ్లేషిస్తున్నారు.


అలాగే నారా లోకేష్ బాబు మంగళగిరి నుంచి పోటీ చేయడం పెద్ద పొరపాటు అని అది బీసీల సీటు అని అలాంటి చోట లోకేష్ ను పోటీ చేయించి చంద్రబాబు నాయుడు తప్పు చేశారని చౌదరి విశ్లేషిస్తూ ఉండటం గమనార్హం!ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును సుజనా చౌదరి సమర్థిస్తూ ఉండటం కూడా గమనించాల్సిన అంశం. కేంద్రంతో సంబంధాల విషయంలో జగన్ సరిగానే వ్యవహరిస్తూ ఉన్నారని చౌదరి విశ్లేషించారు. తాము కూడా చంద్రబాబుకు అదే విషయాన్ని చెప్పటినట్టుగా చౌదరి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: