జనసేన తరుపున పోటీ చేసి గెలిచినా ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఇతను రాజోలు నుంచి పోటీ చేసి జనసేన తరుపున అసెంబ్లీలోకీ అడుగు పెట్టాడు. అయితే రాపాక వరప్రసాద్ పార్టీ మారుతున్నాడని అప్పట్లో వదంతులు వచ్చాయి. అయితే అవ్వన్నీ అబద్దాలు అని తప్పక ఖండించారు. అయితే ఇదిలా ఉంటే మొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు.


వైఎస్ జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి.. తన ఛాంబర్‌కు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వరప్రసాద్ సీఎం ఛాంబర్‌కు వెళ్లి.. జగన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత బయటకు వచ్చిన వరప్రసాద్.. జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వరప్రసాద్ వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది.. ఆయన కూడా ఎయిర్‌పోర్టులో జగన్‌ను కలవడంతో ఊహాగానాలకు బలమిచ్చాయి.


దీనితో జగన్ ను కలవడం ఏంటని అప్పట్లో ఇతని మీద అప్పట్లో జనసైనికులు ట్రోలింగ్ కూడా మొదలెట్టేసారు. కానీ తాను మాత్రం జనసేన పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు. అయితే అసెంబ్లీ లో రాపాక .. జగన్ ను విమర్షించకపోవటం నాగబాబుకు నచ్చడం లేదని ఇలా అయితే జనసేన మీద జనాలకు మంచి ఫీలింగ్ రాదని, నాగబాబు .. రాపాకకు సుతి మెత్తగా క్లాస్ పీకినట్లు సమాచారం. రాపాక అసెంబ్లీలో జగన్ ను ప్రశంసిస్తూ మాట్లాడిన సంగతీ తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: