2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తున్నాయి. చంద్రబాబు అమెరికా వెళ్ళగానే అనేక పరిణామాలు జరిగాయి.
ఆ పార్టీకి చెందిన 4 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇది జరిగి 24 గంటలకు కూడా గడవక ముందే... తెలుగుదేశం పార్టీకి చెందిన మరో 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవుతున్నారని సమాచారం అందుతోంది. ఈరోజు వీరంతా బీజేపీలో చేరబోతున్నారు.
ప్రస్తుతం వీరంతా శ్రీలంకలో ఉన్నారట. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి.. బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. గంటా నేతృత్వంలో వీరంతా బీజేపీలో జాయిన్ అవుతున్నారు. అయితే, లోకేష్ మాత్రం ఇవి కేవలం పుకార్లే అని కొట్టిపారేస్తున్నారు.
ఒకవేళ ఇదే జరిగితే.. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. బాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదాను కోల్పోతాడు. అయితే, గంటాతో పాటు బీజేపీలో జాయిన్ కాబోతున్న ఆ 15 మంది ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది.