ప్రైవేట్ స్కూల్స్ విద్యను ఎప్పుడో వ్యాపారంగా మార్చేశారు. దీనితో పేరెంట్స్  పిల్లలను చదివించాలంటే తలకు మించిన భారం అవుతుంది. విద్యాశాఖపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల బాదుడుతో పాటూ పలు ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటించారు. విద్యాశాఖపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోబోతున్నట్లు చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరుశాతం అమలు చేస్తామని జగన్ అన్నారు.


రాష్ట్రంలో విద్యార్థులు, తల్లుల్ని ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతూనే.. తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామన్నారు. ఇక పిల్లలకు యూనిఫారాలు, పుస్తకాలు సకాలంలోనే ఇస్తామన్నారు. అంతేకాదు విద్యార్థులకు షూలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. జనవరి 26 నుంచి 'అమ్మఒడి' చెక్కుల పంపిణీ జరుగుతుందన్నారు జగన్.


ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపు తప్పనిసరని.. కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో ఉపాధ్యాయులు ఉండాలన్నారు సీఎం. విద్యా వ్యాపారం కాకూడదన్న జగన్.. దేశంలో విద్య అనేది సేవ కానీ.. డబ్బు ఆర్జించే రంగం కాదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: