కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే.
దీంతో రాజధాని ప్రాంతంలోని గత సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలోని నిర్మించిన ప్రజావేదిక తొలగింపుతో.. అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రాలో అక్రమనిర్మాణాల కూల్చివేత మొదలయి,రాజకీయాల్లో సందడి పెరుగుతుండగా, తెలంగాణలో అలాంటి సంఘటనే జరిగింది.
నగర శివారులోని నార్సింగి ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు పలుగు, పార తీశారు.
దీనిలో భాగంగా సినీదర్శకుడు వి.వి.వినాయక్కు షాక్ ఇచ్చారు.
వట్టినాగులపల్లిలోని గౌలిదొడ్డిలో నిర్మాణంలో ఉన్న ఆయన ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేశారు.
ఆయనకు నోటీసులు జారీచేసినప్పటికీ ,ఎలాంటి స్పందనా రాకపోవడంతో కూల్చివేసారు.
రెండంతస్తుల భవనం నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఉండగా.. వినాయక్ ఆరంతస్తులు నిర్మిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో మరిన్ని అక్రమ నిర్మాణాలున్నట్టు, మున్సిపల్ అధికారులు తేల్చారు.