రాజుగారు వస్తున్నారు.. అందరు సైలెంట్ అవ్వండి.. అలర్ట్ అవ్వండి అంటూ చెప్పినట్టుగా.. అమిత్ షా వస్తున్నారు అందరు అలర్ట్ అవ్వండని అంటున్నది బీజేపీ. ఈరోజు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. కేంద్ర హోమ్ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారు.
కేంద్ర హోమ్ శాఖ మంత్రి కావడంతో బందోబస్తు హడావుడి అంతా ఉంటుంది. ఏ విషయం గురించి ఆయన వస్తున్నారు అన్నది తెలియాలి. ఎలాగో వస్తున్నారు కాబట్టి రెండు రాష్ట్రాలకు చెందిన వారు ఆయన్ను తప్పకుండా కలుస్తారు.
కలవడమే కాదు.. ఈరోజు పార్టీలో చాలామంది చేరికలు కూడా ఉంటున్నాయని సమాచారం అందుతోంది. ఎంతమంది పార్టీలో చేరుతున్నారు.. ఎవరెవరు పార్టీ మారుతున్నారు అన్నది బీజేపీ దగ్గర క్లారిటీ ఉండే ఉంటుంది. బహుశా పెద్ద తలకాయలు పార్టీలో చేరే అవకాశం ఉండొచ్చు.
అందుకే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వస్తుండొచ్చు. ఎవరెవరు చేరుతున్నారు.. ఎంతమంది చేరుతున్నారు అనే విషయాలు మరి కాసేపట్లోనే వివరంగా తేలిపోనున్నాయి. పనిలో పనిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ పై ఏమైనా మాట్లాడతారేమో చూడాలి.