కేంద్రం ప్రతిపాదించిన జీరోబేస్డ్‌ వ్యవసాయ విధానం నేతిబీర లో నేతిని వెతకడం లాంటిదంటున్నారు రైతులు. ఈ విధానంలో ఆచితూచి అడుగులు వేయకపోతే, చివరకు దేశంలో ఆహారభద్రత దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఈ పద్ధతిలో సాగుచేయడానికి దేశంలో ఆరు కోట్ల టన్నుల సేంద్రియ ఎరువులు అవసరం కాగా.. ప్రస్తుతం 50 లక్షల టన్నులు మాత్ర మే అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

సహజ సాగుపై అధ్యయనం చేయకుండా , ఇప్పటికిప్పు డు ఈ విధానాన్ని అమలుచేస్తే భారతదేశ వ్యవసాయరంగం.. వెనుకకు వెళ్లే ప్రమాదం ఉన్నదని, ముందుగా నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలుచేసి.. దశలవారీగా దేశమంతటా విస్తరించాలని సూచిస్తున్నారు.

' కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న సహజ వ్యవసాయ సాగు విధానాలపై దేశవ్యాప్తంగా ఆధ్యయనంచేసి, కేంద్రానికి ఆరునెలల్లో నివేదిక సమర్పిస్తామని' సహజ వ్యవసాయం సాగు అధ్యయన కమిటీ చైర్మన్‌ వీ ప్రవీణ్‌రావు అంటున్నారు.


'' పెట్టుబడిలేని సాగు విధానంతో రైతుల పెట్టుబడులు తగ్గి, ఆదాయాలు పెరిగే అవకాశాలున్నా.. దానితోపాటు పంటల దిగుబడులుతగ్గి దేశంలో ఆహారభద్రత దెబ్బతినే ప్రమాదం ఉన్నది. కరవు ప్రాంతాలకు ఈ పద్ధతి అనుకూలం. జీరో బేస్డు సాగు అంటే పెట్టుబడి ఉండదని కాదు,కూలీలకు, విత్తనాలకు ఇతర ఖర్చులు ఉంటాయి.

ఉన్న పళంగా సహజ సాగును చేయడం సాధ్యం కాదు, ఐదేళ్ల వరకు భూమిని సేంద్రీయ ఎరువులకు అలవాటు చేయాలి. '' అని ఆదిలాబాద్‌ జిల్లా లో సేంద్రియ పంటలు సాగు చేస్తున్న రవీందర్‌ అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: