ఆదివారం, బంజారాహిల్స్‌ హయ్యత్‌ ప్యాలెప్‌ లో, సెక్రటేరియట్‌ కూల్చివేతపై అఖిల పక్షాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి నిర్వహణలో, ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఈ తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అవి వరుసగా....

1,సెక్రెటేరియట్‌, అసెంబ్లీలను ఇప్పుడున్న భవనాలలోనే కొనసాగించాలి. కూల్చివేతలు, కొత్త భవనాల నిర్మాణాలకు నిధులను దుర్వినియోగం చేయొద్దు.

2, సెక్రటేరియట్‌ భవనాలను ఎర్రంమంజిల్‌ భవనాన్ని కూల్చొద్దు. 3, చారిత్రక వారసత్వ కట్టడాల విధ్వంసాన్ని అడ్డుకోవాలి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఉనికిని కాపాడాలి.

4, పై డిమాండ్ల సాధనకు గవర్నర్‌ ను కలిసి మెమోరాండం ఇవ్వాలి. జిల్లాల్లో ఆల్‌ పార్టీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను జరపాలి. అందుకు ప్రజాస్వామిక తెలంగాణ చొరవ తీసుకోవాలి. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని అఖిలపక్షం ప్రకటించింది.

5, అత్యున్నత న్యాయ స్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. కొత్త నిర్మాణాలు, భవనాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

6, ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. పై తీర్మానాలను ప్రజాస్వామిక తెలంగాణ వేదికగా నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: