ఏపీ మాజీ సీఎం చంద్రబాబు జైలుకు వెళ్లబోతున్నారా.. ఆయన్ను జైలుకు పంపేందుకు బీజేపీ, వైసీపీ సంయుక్తంగా కుట్ర పన్నుతున్నాయా.. అవునంటున్నారు టీడీపీ నేతలు.. అందుకే బీజేపీ నేతలు త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్తారంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.


తాజాగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఇదే అంటున్నారు. చంద్రబాబును జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారాయన. చంద్రబాబును అవమానించడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని కోడెల మండిపడుతున్నారు.


అసెంబ్లీని కేవలం చంద్రబాబును ఇన్సల్ట్ చేసేందుకే ఉపయోగిస్తున్నారని.. ఈ నెలన్నర రోజుల పాలనలో జగన్ పూర్తిగా విఫలమయ్యాడంటూ కోడెల ధ్వజమెత్తుతున్నారు. ఇక తన కుటుంబంపై కూడా కక్షసాధింపులు సాగుతున్నాయని మాజీ సభాపతి ఆరోపించారు.


తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కోడెల శివప్రసాదరావు అంటున్నారు. నిజంగా తన కుటుంబ సభ్యులు తప్పుచేసి ఉంటే.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారనేది కూడా మైండ్ గేమ్ లో భాగమేనని కోడెల తేల్చి చెప్పారు. తన వరకూ తాను ఊపిరిపోయేంత వరకూ టీడీపీలోనే ఉంటాననని కోడెల అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: