కేంద్రహోం శాఖ మంత్రి కిషన్ రెడ్డితో టిడిపి ఎంఎల్ఏ భేటీ అయ్యారు. అధికార కార్యక్రమాలపై విజయవాడ వచ్చిన కిషన్ పనిలో పనిగా పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే కిషన్ తో గన్నవరం టిడిపి ఎంఎల్ఏల వల్లభనేని వంశీ భేటీ అవటం పార్టీలో సంచలనంగా మారింది.

 

దాదాపు అర్ధగంటసేపు వీళ్ళిద్దరూ  మాట్లాడుకున్నారు. టిడిపికి చెందిన 18 ఎంఎల్ఏలు తమతో టచ్ లో ఉన్నారని ఈమధ్యనే ఏపి ఇన్చార్జి రామ్ మాధవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్లే ఇపుడు వల్లభనేనితో కిషన్ రెడ్డి భేటీ అవటం గుప్పుమన్నది.

 

టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరైన సుజనా చౌదరి ద్వారా ఎంఎల్ఏలను లాక్కునేందుకు బిజెపి  ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సుజనా ఓసారి వల్లభనేనితో మాట్లాడారు. తాను బిజెపిలో చేరటం లేదని ఆమధ్య ప్రకటించారు. అయితే తాజా భేటీ గురించి మాత్రం వల్లభనేని నోరిప్పటం లేదు. మొత్తానికి తొందరలోనే చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: