ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రమాదాలు కొన్ని అనుకోకుండా జరుగుతుంటే..డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల మరికొన్ని జరుగుతున్నాయి. తాజాగా ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి రక్షణగా వెళ్లిన పోలీసు ఎస్కార్ట్ వాహనం బోల్తాపడి పలువురికి గాయాలు అయ్యాయి.
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఈ సంఘటన చెటు చేసుకుంది. పెనుకండ సమీపంలో చంద్రబాబు కు ఎస్కార్ట్ గా వెళ్లిన పోలీసులు తిరుగు ప్రయాణంలో వారు ప్రయానిస్తు్న ఎస్కార్ట్ వాహనం ఉన్నట్టుండి బోల్తాపడింది.
ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన ఇతర సిబ్బంది గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు వైద్య సిబ్బంది.