జగన్ అధికారంలోకి వచ్చిన క్షణమే ఓ మాట చెప్పాడు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించాలి. ఎక్కడా ఏ శాఖలో కూడా అవినీతి జారకుండా చూసుకోవాలి. ఎక్కడైనా సరే అవినీతి జరిగితే.. దానిని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఏ అధికారి అవినీతికి పాల్పడ్డా.. ఏ మంత్రి అవినీతికి పాల్పడ్డా సహించేది లేదని వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే చెప్పారు.
చెప్పినట్టుగానే జగన్ తన పనిని తానూ చేసుకుంటూ పోతున్నాడు. మంత్రి వర్గంలో ఐదుగురు వ్యక్తులు మంత్రులపై జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ ఐదుగురు జాబితాలో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నట్టు సమాచారం.
సదరు మహిళకు మంత్రి పదవి దక్కడమే ఎక్కువ అనుకుంటున్న సమయంలో... ఆ శాఖలో ఆమె భర్త జోక్యం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రతి విషయాన్నీ ఆయన చూసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని జగన్ కు సమాచారం అందింది.
దీంతో పాటు ఓ సీనియర్ మంత్రి కూడా అవినీతికి పాల్పడుతున్నట్టు సమాచారం. అలానే, ఓ మంత్రి రెండు కోట్ల కోసం చేతులు చాచారని తెలుస్తోంది. వీరితో పాటు మరో ఇద్దరు మంత్రులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారట. వీరికి జగన్ ఇప్పటికే ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. అప్పటికి వీరి ప్రవర్తనలో మార్పులు రాలేదని తెలుస్తోంది. త్వరలోనే వారికి ఉద్వాసన పలుకుతారని వార్తలు వస్తున్నాయి.