తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు. ఈ సామెత జగన్ - బాబు విషయంలో కరెక్ట్ గా సరిపోతొంది. నిజంగా 'అపర చాణిక్యం'గోరినే మట్టి కరిపించి అధికారికం దక్కించుకున్న నేర్పరి జగన్. ఇప్పుడు ఇదే సామెత జగన్ విషయంలో రివర్స్ అవ్వబోతుంది. జగన్ ను ముంచటానికి ఓ పెద్ద బుర్ర పెద్ద ప్లానే వేస్తోందట. వాస్తవానికి ఆ పెద్ద బుర్ర కారణంగానే దక్షిణాదిన రాజకీయాలు ఎవ్వరు ఊహించని రీతిలో రోజురోజుకు అనేక మార్పులు జరిగిపోతున్నాయి. ఉదాహరణకు కర్ణాటక రాజకీయాల పరిస్థితి చూస్తే అర్ధమవుతుంది.
అయితే ఈ రోజు కర్ణాటక.. రేపు ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశ్యంతోనే.. ఆ పెద్ద బుర్ర ఆలోచిస్తోందట. ఆ ఆలోచనలతోనే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకులూ పావులు కడుపుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులను తమలో కలిపేసుకుని వైసీపీని టార్గెట్ చేయాలని మోదీ - షాల పెద్ద బుర్ర ఆలోచన. అయితే జగన్ కి ఎదురుగా బలంగా అవతరించాలంటే పక్కా వ్యూహాలు కావాలి. ప్రతుతం షా అలాంటి ఆలోచనలతోనే ముందుకు వెళ్తున్నాడట. ముఖ్యంగా వీరు జగన్ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసుకొని వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నట్టు సమాచారం.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బీజేపీ నేతలు అంతా తాము రాబోయే రెండు సంవత్సరాల్లో ఒక అద్భుతం సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏపీ రాజకీయ వర్గాల్లో రానున్న రోజుల్లో జగన్ కు చెక్ పెట్టేది బీజేపీనేనా..? అయినా జన బలం ఉన్న జగన్ ను నిలువరించడం సాధ్యమా.. ? అలాగే వ్యూహాలు పన్నడంలో పండిపోయిన బాబుగోరిని పూర్తిగా నిలువరించడం అయ్యో పనేనా..? బీజేపీ ఎక్కువ ఉహించుకుంటుందా.. ఏది ఏమైనా బీజేపీ దెబ్బకి కర్ణాటకలో ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొవాలి. మొత్తంగా బీజేపీ భారీ ప్లాన్ దెబ్బకి.. జగన్ కి బిగ్ షాక్ తప్పేలా లేదు. మరి జగన్ ఏం చేస్తాడో చూడాలి.