రాజకీయాల్లో గెలిచిన వాడే విజేత.. పరాజితుడిపై సానుభూతి కూడా ఉండదు.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ విషయంలో ఇలాగే జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో పరాజయంతో నారా లోకేశ్ చాలామందిలో చులకన అయ్యారు.


అందులోనూ లోకేశ్ కు పప్పు అనే ఇమేజ్ దారుణంగా పడిపోయింది. నోరు సరిగ్గా తిరక్కపోవడంతో సోషల్ మీడియాలో చాలా కాలం కామెడీ పీస్ అయ్యారు. తాజాగా వరల్డ్ కప్ సెమీస్ ఇండియా ఓడిన తర్వాత లోకేశ్ పోస్టు చేసినట్టు ఓ పోస్టు వైరల్ అవుతోంది.


అందులో ఏముందంటే.. సెమీపైనల్లో ఓడితే ఓడారు.. కానీ ఫైనల్లో మాత్రం కచ్చితంగా గెలవండి.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నవారే అసలైన విజేతలు.. అని ఉంది. వాస్తవానికి నారా లోకేశ్ ఆ పోస్టు పెట్టనే లేదు.


వాస్తవానికి లోకేశ్ ఏమని పోస్టు పెట్టారంటే.. ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమించిందన్న బాధ గుండెల్ని మెలిపెడుతోంది. ధోనీ, జడేజా పోరాటం విజయం అంచులవరకూ తెచ్చినా.. ఈరోజు మనది కాకుండా పోయింది. ఏదైమైనా విజయం కోసం కషి చేసిన కోహ్లీసేనకు సలామ్.. అని లోకేశ్ పెట్టారు.

అంటే లోకేశ్ కు ఉన్న ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసేందుకు ఇలాంటి ఫేక్ పోస్టులు పెడుతున్నారు. నారా లోకేశ్ ను ఇలా కూడా ఆడుకుంటున్నారు నెటిజన్లు..


మరింత సమాచారం తెలుసుకోండి: