ఏపిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నాడు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలను అమలు చేసేందుకు వీలుగా వాటికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీ  ప్రభుత్వం వ్యవసాయానికి అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో రూ. 20,677 కోట్లను  కేటాయించింది. రైతాంగ సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉంటామని ఎన్నికల సభల్లో వైఎస్ జగన్  ప్రకటించారు.  ఈ మేరకు బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ..ఏపీలో ప్రజారవాణా వ్యవస్థను ఎకో ఫ్రెండ్లీగా మారుస్తామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామనీ, ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

201920 బడ్జెట్ లోని ముఖ్యంశాలు : 

- ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగానికి రూ.46,858 కోట్ల కేటాయింపు
-ఏపీలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు
-ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2,002 కోట్లు కేటాయింపు
-సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు 
-వైఎస్సార్ రైతు భరోసా పథకానికి రూ.8,750 కోట్లు
-వైఎస్సార్ రైతు బీమాకు రూ.1,163 కోట్లు
-అక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం రూ.475 కోట్లు
-మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి రూ.952 కోట్లు
-రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ కోసం రూ.4,525 కోట్లు
-రైతుల పంటకు సంబంధించి ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3,000 కోట్లు
-రైతన్నలకు ఉచిత బోర్లు వేయించేందుకు రూ.200 కోట్లు
-విత్తనాల పంపిణీకి మరో రూ.200 కోట్లు కేటాయింపు
-ఏపీలో వృద్ధులు, వితంతువుల పెన్షన్ల కోసం రూ.12,801 కోట్లు కేటాయింపు
-మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు రూ.6,587 కోట్లు కేటాయింపు
-అగ్రిగోల్డ్ బాధితులకు సాయం కోసం రూ.1,150 కోట్లు 
- విద్యారంగానికి అధిక ప్రాధాన్యత.. రూ.32,618 కోట్ల కేటాయింపు
-ఏపీలోని దివ్యాంగులకు పెన్షన్ల కోసం రూ.2,133.62 కోట్లు
-ఒంటరి మహిళలకు పెన్షన్ల కోసం మరో రూ.300 కోట్లు
-వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు
-అమ్మఒడి పథకానికి రూ.6,455 కోట్ల కేటాయింపు
-పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,500 కోట్లు, 
-నిర్వహణ గ్రాంటు కింద రూ.160 కోట్లు కేటాయింపు
-మధ్యాహ్న భోజన పథకానికి రూ.1,077 కోట్లు
-డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,140 కోట్లు
-వైఎస్సార్ గృహవసతి పథకానికి రూ.5,000 కోట్లు
-దళితుల అభివృద్ధికి రూ.15,000 కోట్లు
-గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లు
-బీసీల అభివృద్ధికి రూ.1561 కోట్లు కేటాయింపు
-గ్రామ సచివాలయాల నిర్వహణకు రూ.700 కోట్లు
-మున్సిపల్ వార్డు వాలంటీర్లకు రూ.280 కోట్లు
-న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100 కోట్లు
-ఏపీలో సంక్షేమ రంగానికి రూ.14,142 కోట్లు
-వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,740 కోట్లు కేటాయింపు
-ఆశావర్కర్ల వేతనాల కోసం రూ.455.75 కోట్లు
-ఏపీఎస్ ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయింపు
-చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.200 కోట్ల మంజూరు
-ధార్మిక సంస్థల అభివృద్ధికి రూ.234 కోట్లు
-విద్యుత్ రంగానికి రూ.6,860 కోట్లు కేటాయింపు
-వైద్య రంగానికి రూ.11,399 కోట్లు
-పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,564.75 కోట్లు
-ఏపీ రెవెన్యూ శాఖకు రూ.9,496.93 కోట్లు
-గృహనిర్మాణం కోసం రూ.3,617 కోట్లు 
-బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కు రూ.100 కోట్లు
-మెడికల్ భవనాల నిర్మాణానికి రూ.68 కోట్లు కేటాయింపు
-వైఎస్సార్ గిరిజన వైద్యకళాశాల ఏర్పాటుకు రూ.66 కోట్లు
-గురజాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి రూ.66 కోట్లు
-విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.66 కోట్లు
-శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం.. రూ.50 కోట్లు కేటాయింపు
-కొత్తగా ప్రాక్టీసు పెట్టుకునే లాయర్ల సంక్షేమానికి రూ.10 కోట్లు
-నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీల సంక్షేమానికి రూ.300 కోట్లు
-పట్టణాల్లోని స్వయం సహాయక బృందాలకు రూ.648 కోట్ల వడ్డీలేని రుణం
-ఏపీ కేన్సర్ నివారణ ఆసుపత్రికి రూ.43 కోట్లు
-మసీదుల్లో ఇమామ్ కు నెలకు రూ.10 వేలు, మౌజన్ కు రూ.5 వేల గౌరవవేతనం అందించాలని నిర్ణయం
-అలాగే పాస్టర్లకు నెలకు రూ.5 వేలు గౌరవవేతనం చెల్లించాలని నిర్ణయించారు
-దేవాలయ ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డులు నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్టీ,ఎస్టీలకు 50 శాతం కోటా
-ఇందుకోసం చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయం
-కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసం రూ.2,000 కోట్ల కేటాయింపు



మరింత సమాచారం తెలుసుకోండి: