కర్ణాటక రాజకీయాలు రోజు రోజుకీ మరింత హాట్ గా మారిపోతూనే ఉన్నాయి. కర్ణాటక సంక్షోభం తెరపడుతోందన్న సమయంలో బల నిరూపణకి అయినా సిద్దమేనని ప్రకటించి సంచలనం రేపారు ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి. ఇవాళ మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు.

తమ రాజీనామాలను ఆమోదించేలా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని తమ పిటిషన్ లో పేర్కొన్నారు ఎమ్మెల్యేలు. తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఎమ్మెల్యేలు సుధాకర్, రోషన్, నాగరాజు, మునిరత్నం కూడా ఉన్నారు. దీంతో సుప్రీంకోర్ట్ నాశ్రయించి మన ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. రామలింగారెడ్డి మినహా ఎమ్మెల్యేలు మొత్తం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


తాము స్వచ్ఛందంగా రాజీనామాలు ఇస్తే స్పీకర్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని మొదట సుప్రీం ను ఆశ్రయించి ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే.రెబల్స్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ ను కలవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: