రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందినచిన న్యూ సాండ్ పాలసీ అమలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పీ.రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేష్, ఏపీఎండీసీ ఎండీ, డైరెక్టర్ లతో కలిసి ఇసుక పాలసీ పై అయన జిల్లా కలెక్టర్ కు వీడియో కాన్ఫిరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఇసుక కొరత లేకుండా తగినంత ప్రమాణాల్లో ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇసుక నిల్వలకు కావాల్సిన ప్రభుత్వ స్థలాలను
గుర్తించాలన్నారు. అక్కడ పెద్ద మొత్తంలో ఇసుకను నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న రీచ్ లకు అదనంగా కొత్త రీచ్ లను ఏర్పాటు చేయడానికి నది పరివాహాలను గుర్తించాలని తెలిపారు. ఈ పనుల కోసం ఇరిగేషన్ , మైనింగ్ రెవిన్యూ అధికారులందరూ కలిసి పర్యవేక్షణ చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న రేటు కంటే అతి తక్కువ రేట్లకే ఇసుకను వినియోగదారులకు పంపిణీ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాసు మాట్లాడుతూ న్యూ సాండ్ పాలసీ సెప్టెంబర్ 5 నుంచి అమలులోనికి రావాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఇసుక కృత్రిమ కొరత ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ప్రస్తుతం ఉన్న రెట్లకన్నా 10 శతం తక్కువ రేట్లకే వినియోగదారులకు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు తెలియజేసారు.