సభలో సీఎం ఒక విషయమై వివరణ ఇచ్చినప్ప్పుడు.. మాకూ అవకాశం ఇవ్వాలి కదా అని ప్రతిపక్షనేత చంద్రబాబు స్పీకర్‌ను కోరారు. మాపై ఆరోపణలు చేసినప్పుడు మాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి కదా అని చంద్రబాబు కోరారు.

తాను ప్రస్తుతం నివాసముంటున్న ఇల్లు తనది కాదని, అది అద్దెకు ఉంటున్న ఇల్లు అని చంద్రబాబు అన్నారు.లింగమనేని రమేశ్‌ అనే వ్యక్తి దగ్గర అద్దెకు తీసుకున్నానని చెప్పారు.


ఈ మధ్యకాలంలో అక్రమ కట్టడాల ఆరోపణ ఎదురుకుని కూల్చివేతకు గురైన ప్రజా వేదిక కూడా తన నివాసం కాదని ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు. భవనాల కూల్చివేత పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొందని, చాలామంది ప్రజలు   నదుల దెగ్గరలో మరియూ చెరువుల దెగ్గరలో ఇళ్లు కట్టుకున్నారని వాళ్ళ నివాసాలను కోల్పోతారెమో అని అనుకుంటున్నారని ఆయన భాదపడ్డారు.

దౌర్జన్యాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అవసరమైతే రోడ్డుపై పడుకుంటా తప్ప ఎవరి బెదిరింపులకు లొంగనని చంద్రబాబు వారి శైలిలో వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: