"నేను పై చదువులు అమెరికాలో చదివాను, 2000 నుంచి 2008 సంవత్సరం వరకూ నేను అమెరికాలో చదివాను తెలుగులో ఒక పదం అటూ ఇటూ అవడంలో తప్పేమి లేదు కదా. నేను వీళ్ల లాగా నలభై మూడు వేల కోట్లు దోచుకోలేదు అని నేను గర్వంగా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ గ్రామీన అభివృద్ధి శాఖ నెంబర్ వన్ వచ్చింది భారతదేశంలో, విద్యుత్ రంగంలో కుడా మొదటిస్తానంలో నిలిచింది తెలుగుదేశం ప్రభుత్వం" అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
అంతేకాక ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లవలసిన అవసరం మాకు లేదని, వ్యక్తిగత ఆరోపణలు చేసి వాటిని నిరూపించలేక ఆధారాలు చూపించలేక తప్పించుకొవడం మాకు రాదని చెప్పారు. మరియు వైసీపీ పాలనలో రాష్ట్రంలో నీటి పారుదల లేకపొయిన నోటి పారుదల ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు.