తాడే పామై కరుస్తుందనే నానుడి తెలుగులో చాలా పాపులర్. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ కు ఆ నానుడి సరిగ్గా అతికినట్లు సరిపోతుందనిపిస్తోంది. ఒకపుడు పై ఇద్దరికీ బాగా సన్నిహితుడైన మాజీ ఎంఎల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తాజాగా లోకేష్ అవినీతిపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.  గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గంలో టిడిపి తరపున రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు లేండి.

 

మాజీ ఎంఎల్సీ కూడా అయిన సతీష్ మొన్నటి వరకూ టిడిపిలో ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత పార్టీ నుండి బయటకు వచ్చేసిన నేతల్లో  సతీష్ కూడా నేతల్లో ఒకడు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎంల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన సతీష్ బిజెపిలో చేరారు.

 

ఎప్పుడైతే బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నారో అప్పటి నుండే లోకేష్ పై ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టారు లేండి. తాజాగా మీడియాతో మాట్లాడుతూ  ఐటి శాఖ మంత్రిగా ఉన్నపుడు లోకేష్ చాలా అవినీతికి పాల్పడినట్లు మండిపడ్డారు. లోకేష్ అవినీతికి సంబంధించిన ఆధారాలన్నింటినీ రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కలిసి అందిస్తారట. అలాగే కేంద్రప్రభుత్వాన్ని కలిసి సిబిఐ విచారణ కూడా కోరుతానంటున్నారు.

 

 

లోకేష్ కారణంగానే టిడిపి తీవ్రంగా నష్టపోయిందంటున్నారు. అయితే ఏ విధంగా నష్టపోయిందో మాత్రం చెప్పలేదులేండి. ఎందరో నేతలు లోకేష్ కారణంగా టిడిపిలో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారే కానీ వారెవరో మాత్రం చెప్పలేదు. చంద్రబాబును నిలువునా ముంచింది కూడా లోకేషేనట. ఏం చేస్తాం సన్ స్ట్రోక్ అంటే చంద్రబాబుకు తెలియాలి కదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: