భూమా కుటుంబానికి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాలలో మంచి పేరుంది.  ఈ కుటుంబానికి చెందిన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు ఆయా ప్రాంతాల్లో పట్టుసాధించారు.  అయితే, శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత పూర్తిగా మారిపోయింది.  శోభా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియా గత ప్రభుత్వం హయాంలో మంత్రిగా చేసింది.  


2019 లో జరిగిన ఎన్నికల్లో అఖిలప్రియ ఓటమిపాలైంది.  స్వతహాగా అఖిలప్రియ వైకాపాపార్టీకి చెందిన వ్యక్తి.  కానీ, టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ కు లోబడి టిడిపిలో జాయిన్ అయ్యింది.  ఇప్పుడు ఓటమి తరువాత పార్టీకి దూరంగా ఉంటోంది.  తిరిగి వైకాపాలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు.  


దీంతో ఆమె చూపులు బీజేపీవైపు ఉన్నాయని సమాచారం. బీజేపీ నేతలు ఆమెతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.  ఒకవేళ బీజేపీలో చేరితే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.  రాజ్యసభతో పాటు మంత్రి పదవి కూడా లభించే అవకాశం ఉందని అంటున్నారు.  


ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు.  రాష్ట్రంలో వేగంగా విస్తరించేందుకు బీజేపీ పావులు కడుపుతున్నది.  ఇందులో భాగంగానే బడాబడా నాయకులకు బీజేపీ గాలం వేస్తోంది.  ఇది కూడా ఇందులో భాగమనే అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: