తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీకి అంత సీన్ లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటుందని యద్ధేవా చేశారు. బీజేపీ, టిఆర్ఎస్ లు చీకటి రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ ను దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ీజేపీ కేంద్ర మంత్రులు తెలంగాణ పర్యటనలలో రాష్ట్రంలో అద్భుతంగా పాలన సాగుతోందని పొగుడుతుండటాన్ని ఆక్షేపించారు.


కేంద్రంలో అన్ని అంశాలలో తెలంగాణ రాష్ట్ర సమితి భే షరతు మద్దతు ఇస్తుంది. ఇలా లోపాయికరిగా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకునే పార్టీలు ఎలా ప్రత్యుర్థు అవుతారని నిలదీశారు. వాళ్ళ నాటకాలు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికేనని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదన్నది నగ్నసత్యం. అయినా ఎమ్యెల్యేగా ఓడిపోయిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ఎగిరెగిరి పడుతున్నారు. ిఆర్ఎస్ బీజేపీ రెండు దొంగ ఆటలు ఆడుతున్నాయి. బీజేపి, టిఆర్ఎస్ అక్రమ రాజకీయాలు చేస్తున్నాయి 
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి లక్ష్మణ్ కు లేదన్నారు.


దేశం  కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాటాలు చేసి సైనికుడు ఉత్తమ్..  ఆయనపై బీజేపీ విమర్శలా అన్నారు. 103 అసెంబ్లీ స్థానాలలో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ బలపడడం అసాధ్యమన్నారు. ెలంగాణలో బీజేపీకి ఎప్పుడు స్థానం లేదని, 4 ఎంపీ స్థానాలు అనుకోకుండా గెలవగానే బీజేపీ ఏదో ఊహించుకుంటుందన్నారు.
బీజేపీ తెలంగాణలో ఎన్నటికీ బలపడదన్నారు. టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని, బీజేపీ వి పగటి కలలేనని జోశ్యం చెప్పారు. ఆగస్ట్ 7న 2016 నాడు గజ్వేల్ లో జరిగిన మిషన్ భగీరథ ప్రారంభవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటే, కేసీఆర్ ఏకంగా మీ గుండెల్లో స్థానం ఉంటే చాలు మాకు ఏమి అక్కరలేదు అనలేదా..? ప్రశ్నించారు.


మే 5, 2018న కేంద్ర రోడ్, భవనాల మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో   తెలంగాణలోని రోడ్లు అద్భుతంగా ఉన్నాయని అనలేదా..అని నిలదీశారు.
సెప్టెంబర్ 18, 2018న  కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సందర్శించి రాష్ట్రంలో  శాంతి భద్రతలు చాలా బాగున్నాయని మెచ్చుకోలేదా..అని గుర్తు చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జయదేవకర్ రాష్ట్రంలో హరిత హారం పనులను మెచ్చుకోలేదా.


కేంద్ర మంత్రులు అహ్లువాలియా, వికె సింగ్ లు హైద్రాబాద్ కు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని విపరీతంగా పొగిడారని చెప్పారు.మీరు మీరు ఒకటి కాకపోతే కేసీఆర్ పైన ఉన్న సీబీఐ కేసుల విషయంలో ఎందుకు విచారణ జరపడంలేదు.. ఈఏస్ ఐ భవనాల నిర్మాణం, ఈ ఎస్ ఐ ఉద్యోగుల పి ఎఫ్ పెన్షన్ల కుంభకోణం విషయంలో ఎందుకు విచారణ చేయడం లేదన్నారు.బీజేపీ నిజంగా టిఆర్ఎస్ పోరాటాలు చేస్తున్నది నిజమైతే బీజేపీకి దమ్ముంటే నాయీమ్ కేసును, మియపూర్ భూ కుంభకోణం, డ్రగ్ మాఫియా కేసు, సాగునీటి ప్రాజెక్టు ల కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ చేశారు.


నోట్ల రద్దు, జిఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నీతి ఆయోగ్, త్రిబుల్ తలాక్, రైట్ ఇన్ఫర్మేషన్ ఆక్ట్ సవరణ, 370 ఆక్ట్ రద్దు లాంటి అనేక అంశాలలో బీజేపీకి భే షరతుగా మద్దతు ఇవ్వలేదా ?.2017, ఏప్రిల్ 16న అసెంబ్లీలో ముస్లిం రిజర్వేషన్లు బిల్లు కోసం తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపారు అది ఎందుకు అమలు కావడం లేదన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: