గత ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తూ.. లోక్సభ, అసెంబ్లీ ఫలితాల్లో జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ విజయం పై జగన్ ఎంత ఆనందపడ్డాడో గాని, విజయసాయి రెడ్డి మాత్రం జగన్ కన్నా ఆనందపడి ఉంటాడు. ఓ దశలో జగన్ కంటే కూడా చంద్రబాబు పై నిప్పులు చెరిగారు ఈ ఎంపీ. సుధీర్గమైన కామెంట్స్ తో బాబు పై ఫైర్ అయిన సందర్భాలు కోకొల్లలు. చంద్రబాబు వ్యూహాలను ఎదురుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వెనుక జగన్ జనబలం మరియు పీకే బుద్ధిబలంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉంది. జగన్నాథ రథచక్రాల్లో చక్రాలు విజయసాయి రెడ్డే అనే స్థాయిలో ఆయన పాత్ర ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతుంటారు. అందుకే గెలుపు రాగానే జగన్, విజయసాయిరెడ్డి ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఇక ఎన్నికల వేళ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పై చేసిన కామెంట్స్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రతి సందర్భంలోనూ అధికారపార్టీకి చంద్రబాబుకి ఆయన తలనొప్పిగా మారారు. సూటిగా ఘాటైన విమర్శలతో టీడీపీని చాలాసార్లు ఇరుకున పెట్టారు. ఏది ఏమైనా జగన్ విజయంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.
తాజాగా మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించాడు. ఓటు వేయక పోతే ఇళ్లు కూలుస్తారా అంటూ చౌకబారు మాటలు మీకే సాధ్యం చంద్రబాబు గారూ అంటూ మా ఎమ్మెల్యేలను గెలిపించని చోట రూపాయి ఇవ్వం అని సిగ్గులేకుండా చెప్పిన చరిత్ర మీది. పార్టీలకతీతంగా ప్రజలందరినీ ఒకేలా చూస్తామన్న జగన్ గారి హుందాతనం మీకెప్పటికీ రాదంటూ మండిపడ్దారు. అంతేకాదు ఉమా గురుంచి మాట్లాడుతూ ఎంత దిగజారావు ఉమా? ఊహాకల్పనలకు కూడా ఒక హద్దుండాలి. సిమెంటు కంపెనీలు బస్తాకు 5 రూపాయలివ్వనిందుకే ఇసుక సరఫరాను ఆపేశామా? నీతో సహా ఇసుక బకాసురులు పదివేల మంది ఒక్కొక్కరు వంద కోట్లకు పైగా దోచుకున్నారు. అలాగే వదిలేయక కొత్త పాలసీ ఎందుకు తెస్తున్నారు అనే కదా నీ బాధ అంటూ ఎద్దేవా చేసారు. అంతేకాకుండా చంద్రబాబు మహారాజా వారి అమరావతి రాజ్యంలో కోడెల అనే సామంతుడి కుటుంబం సాగించిన అక్రమాలు నివ్వెరగొల్పేలా ఉన్నాయి. బైకులు విక్రయించి ఆర్టీయేకు జీవిత పన్ను చెల్లించకున్నా అధికారులేం చేశారో అంతుబట్టదు. పార్టీ నుంచి బహిష్కరించకుండా బాబు ఇంకా కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ 40 ఏళ్ల అనుభవం రాష్ట్రాల మధ్య విద్వేషపు గోడలు నిర్మిస్తే సీఎం జగన్ గారు వాటిని ధ్వంసం చేసి స్నేహ వారధులు తెరిచారు. పదేళ్ల తర్వాత ఆగస్టులో కృష్ణా డ్యాములన్నీ నిండాయి. రిజర్వాయర్ల గేట్లు ఎత్తే కార్యక్రమాల్లో సీఎం గారి సూచన మేరకు ఇరు రాష్ట్రాల మంత్రులు పాల్గొనడం అరుదైన దృశ్యమని సంబోధించారు.